వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకం ప్రకారమే ఉగ్రవాదుల దాడులు: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు సమన్వయంతోనే ముంబైలో దాడులకు పాల్పడ్డారని కేంద్ర హోం శాఖ మంత్రి పి. చిదంబరం అన్నారు. దాడులపై ఆయన బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబైలో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయని, పది మంది మరణించినట్లు ముఖ్యమంత్రితో మాట్లాడి ధ్రువీకరించుకున్నాని, గాయపడిన 54 మందిని ఆస్పత్రులకు తరలించారని, గాయపడిన సంఖ్య పెరగవచ్చునని, మృతుల సంఖ్య కూడా పెరగవచ్చునని ఆయన అన్నారు.

పోలీసు బృందాలు, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని, ఢిల్లీ, హైదరాబాదుల నుంచి ఒక్కటేసి సిఎస్ఎఫ్ఎల్ బృందాలు ముంబైకి బయలుదేరాయని ఆయన అన్నారు. ముంబై పేలుళ్లను భారత ప్రదాని మన్మోహన్ సింగ్ ఖండించారు. దాడిని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా ఖండించారు.

English summary
The Home Minister P Chidambaram issued this statement on the terror attacks in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X