టెక్కీల పేరుతో మకాం వేసి హైటెక్ వ్యభిచారం
నిర్వాహకులు తాము సాఫ్ట్వేర్ నిపుణులమని చెప్పి ఓ ఆపార్టుమెంటులో దిగారు. వైజాగ్ ఎస్కార్ట్ పేరు మీద వారు ఓ వెబ్సైట్ను నడిపిస్తూ కస్టమర్లు ఆన్లైన్లో అమ్మాయిలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఎక్కడి అమ్మాయి కావాలంటే అక్కడి అమ్మాయిలను సరఫరా చేస్తూ ఆ ఆపార్టుమెంటు ఫ్లాట్లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కస్టమర్లను ఫ్లాట్లో ఉంచి, దాంట్లోకి అమ్మాయిలను పంపి వ్యవహారం నడిపించేవారు.
వాచ్మన్కు కూడా అనుమానం రాకుండా ఈ వ్యవహారాన్ని నడుపుతూ వచ్చారు. ఈ హైటెక్ వ్యభిచారం విశాఖపట్నంలోనే కాకుండా ఢిల్లీ, హైదరాబాదుల్లో కూడా నడుపుతున్నట్లు సమాచారం. ఈ వివరాలను సేకరించే పనిలో విశాఖపట్నం పోలీసులు పడ్డారు. గత 20 రోజుల్లో 200 మంది అమ్మాయిలను ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లు పోలీసుల పరిశోధనలో వెల్లడైంది. అరెస్టయినవారిలో ఇద్దరు మగవాళ్లు, ఓ స్త్రీ ఉన్నట్లు తెలుస్తోంది.