తెలంగాణపై మళ్లీ నోరు విప్పిన చిదంబరం

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలపై, ప్రజలపై బలవంతంగా రుద్దలేమంటూ ఆయన చేతులెత్తేశారు. సమస్య పరిష్కారం ఎవరికి వారు అసాధ్యమంటే లాభం లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం నిలువునా చీలిపోయాయని ఆయన అన్నారు. బిజెపి మాత్రమే తెలంగాణపై ఒకే మాటపై ఉందని ఆయన చెప్పారు. బిజెపి మినహా అన్ని పార్టీలు చీలిపోయాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications