వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటలు నమ్మకాన్ని కలిగించడం లేదు: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం మాటలు నమ్మశక్యంగా లేవని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. లేదంటే యథావిథిగా సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. సమ్మెకు తెలంగాణలోని అన్ని సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ఎన్నికల ముసాయిదాలో చొప్పించి హామీ ఇచ్చారని, ఆ తర్వాత డిసెంబర్ 9న పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని ఇప్పుడు తెలంగాణపై వెనక్కి తగ్గే చర్యలు సరికావన్నారు.

గురువారం బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్, ఎన్సీపీ చీఫ్ శరద్ యాదవ్ తదితరులను కలిశామని చెప్పారు. వారంతా తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారని అన్నారు. తెలంగాణపై ప్రభుత్వం దిగి వస్తే సరే లేదంటే సమ్మెకు ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని టిఎన్జీవో నేత స్వామి గౌడ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేసి తెలంగాణ కోసం ఉద్యమించాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు.

English summary
Telangana political jac chairman Kodandaram suspecting central government stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X