జగన్ను దేవుడు చూస్తున్నాడు!: మంత్రి సారయ్య

ఆగస్టు 15 జెండా వేడుకల్లో మంత్రులు పాల్గొనాలా లేదా అనే విషయం స్టీరింగ్ కమిటీలో నిర్ణయిస్తామని చెప్పారు. తామంతా గాంధేయ వాదులం. కాబట్టి అహింసాయుతంగా పోరాడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఏదేదో ఊహించుకొని చర్చలకు రాకపోవడం సరికాదని మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు. చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే కొన్ని శాఖలను ఎస్మా పరిధిలోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. భద్రతా దళాలు పెంచింది సైతం ప్రజల గురించే అని చెప్పారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి వ్యాఖ్యలు తాను చూడలేదని అవి చూశాక స్పందిస్తానని మరో మంత్రి అహ్మదుల్లా కడపలో అన్నారు.












Click it and Unblock the Notifications