కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యర్థులకు శాపనార్థాలు పెట్టిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: తన రాజకీయ ప్రత్యర్థులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శాపనార్థాలు పెట్టారు. కడప జిల్లా పులివెందులలో ఆయన గురువారం వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, ఆ శక్తులు నాశనం కాకతప్పదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అభివృద్దే ధ్యేయంగా పనిచేశారని, అటువంటి వైయస్‌పై బురదచల్లేవారు నాశనమైపోతారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మరణించినా ప్రతి ఒక్కరి గుండెలో జీవించే ఉన్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, వారు అనైతిక పోరాటం చేస్తున్నారని, అయినా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతి గుండెలో ఉన్నారని ఆయన అన్నారు.

English summary
YSR Congress party president YS Jagan lashed out at his opponents at Pulivendula of Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X