సాధారణ ఖైదిగానే గాలి: టిఫిన్ చేయడానికి అయిష్టత

Gali Janardhan Reddy
హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో ఉన్న కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్దన్ రెడ్డి జైలులో మొదటి రోజు ఉదయం గం.5.45ని.లకే నిద్ర లేచారు. ఆ తర్వాత జాతీయ దినపత్రికలను తిరగేశారు. గం.7.25ని.లకు జైలు సిబ్బంది ఫలహారం తీసుకొని వెళ్లి ఇవ్వగా నిరాకరించాడు. ఆ తర్వాత జైలు సిబ్బంది ఇచ్చిన పాలు తాగారు. గాలి మొదటి రోజు దినచర్యను జైలు సూపరిండెంట్ కేశవనాయుడు చెప్పారు. ఉదయం లేచి పత్రికలు చదివారని చెప్పారు. ప్రతి 20 మందికి ఒక పత్రిక అందజేస్తామని, ఇరవై మందిలో జనార్దన్ రెడ్డి రెండో వాడన్నారు. సుమారు 40 నిమిషాలు పత్రికలు చదివారు. గాలి తోటి ఖైదీలతో ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడలేదు. తనతో పాటు అరెస్టైన వేరే బ్యారెక్‌లో ఉంటున్న ఓఎంసి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి కాసేపు మాట్లాడారు.

అనంతరం తన లాయర్లతో కేసు విషయమై సుమారు గంట సేపు సమాలోచనలు జరిపారు. వైద్యులు వచ్చి గాలికి వైద్య పరీక్షలు చేశారు. గాలి తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని జైలు అధికారులను కోరలేదు. కోర్టు సైతం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించలేదు. కాబట్టి ఆయనను సాధారణ ఖైదీలాగే చూస్తున్నట్టు కేశవనాయుడు చెప్పారు. మధ్యాహ్నం గం.11.30ని. ప్రాంతంలో లంచ్ ఇవ్వనున్నారు. అయితే గాలి లంచ్‌కు నిరాకరించిన ఆయన కోరిన ఆహారం ఇవ్వాలంటే వైద్యుల నివేదిక, సలహా ఆధారంగానే ఇస్తామని చెప్పారు.

కాగా సోమవారం గాలి జనార్దన్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నాటకీయ ఫక్కీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి జెడి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో కర్నాటక వెళ్లిన సిబిఐ సోమవారం ఉదయమే ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి గాలిని, ఓఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+