నో వర్క్ నో పే: ఉద్యోగులకు సర్కారు వార్నింగ్

177 చట్టం హైకోర్టు ఆదేశాల మేరకే అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులపై నో వర్క్ నో పే అమలు చేసే అవకాశం ఉందన్నారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. తెలంగాణపై అందరికీ ఆమోదయోగ నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల తెలంగాణ ప్రజలే నష్ట పోతారని మరో మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదన్నారు. సమ్మెపై ఉద్యోగులు మరోసారి ఆలోచించాలన్నారు. సమ్మె ఎవరి మీద చేస్తున్నారో గుర్తెరగాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమ్మెపై సమీక్ష అనంతరం వారు మాట్లాడారు.












Click it and Unblock the Notifications