తెలంగాణకు వ్యతిరేకం కాదు: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో చర్చలు జరిపిన అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సమస్యను త్వరలో పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. పార్టీలో తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం ఆజాద్ చర్చలు జరుపుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యను సత్వరం పరిష్కరించాలనేదే అందరి అభిప్రాయమని ఆయన అన్నారు.

తెలంగాణ సమస్య జఠిలమైందని, సమస్య పరిష్కారానికి పార్టీ అధిష్టానం అంతర్గత చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. సమ్మెను విరమించుకోవాలని ఆయన తెలంగాణ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వం చరచ్లు జరుపుతుందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ సీటుకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని ఆయన అన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా పార్టీ విధానం మేరకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై తాను ఆజాద్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. పార్టీ మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+