వైయస్ జగన్ను భూతంగా అభివర్ణించిన డిఎల్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న మంత్రి శంకరరావు, తెలంగాణ కోసం ధర్నా చేసిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి డిఎల్ రవీంద్రా రెడ్డి మాట్లాడినట్లు అనిపిస్తోంది. అంతర్గతంగా పరిష్కరించుకోవడం వీలు కాకపోతే మంత్రి పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోలేరని ఆయన చెప్పారు. కొడితే తెలంగాణ వస్తుందనుకోవడం భ్రమ అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అవినీతిపై గట్టిగా పోరాడుతున్నారని, ముఖ్యమంత్రికి నైతిక మద్దతు అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications