కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో సీమాంధ్ర సెక్యూరిటీ అధికారిపై దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
కరీంనగర్: జిల్లాలోని రామగుండం మండలం బసంత్ నగర్‌లోని ఓ సిమెంట్ కంపెనీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారిపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. సిమెంట్ కంపెనీలో డిప్యూటీ సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్న నరేంద్ర చౌదరి అనే వ్యక్తిపై దుండగులు రాడుతో దాడి చేసారు. విధుల అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా స్టాఫ్ కాలనీ రోడ్డు మార్గంలో కాపు కాసిన వాళ్లు ఆయనతో రాడుతో దాడికి దిగారు. ఇందుకోసం గంట ముందు నుంచే వారు ఆ ప్రాంతంలో తిరిగారట. తీవ్రంగా గాయపడిన నరేంద్రను కంపెనీ సిబ్బంది పెద్దపల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. చౌదరి పరిస్థితి విషమంగా ఉండటంతో ముందుగా కరీంనగర్ ఆ తర్వాత హైదరాబాద్ తరలించారు.

అయితే డిప్యూటీ సెక్యూరిటీ అధికారిగా నాలుగేళ్లుగా ఆయన అక్కడ పని చేస్తున్నారు. తెలంగాణవాదుల పట్ల ఆయన ప్రవర్తన దురుసుగా ఉందని అందుకే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఆయన ప్రవర్తనపై పలుమార్లు విమర్శలు కూడా వచ్చాయట.

English summary
Unknown people attacked on Seemandhra security officer at Kesoram Cements company of Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X