హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దానం నాగేందర్‌ను వెనకేసుకొచ్చిన బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: సికింద్రాబాదు అడ్డగుట్ట వద్ద జరిగిన దాడి ఘటనలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనకేసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తల తీరును ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. దానం నాగేందర్‌పై తెరాస కార్యకర్తలు దాడి చేశారని, దాంతో ఆత్మరక్షణ కోసం వారిని దానం నాగేందర్ ఎదుర్కున్నారని ఆయన అన్నారు. పరిస్థితి కారణంగానే పోలీసులు లాఠీచార్జీ చేశారని ఆయన చెప్పారు. దానం నాగేందర్‌పై దాడిని బలహీనవర్గాలపై దాడిగా పరిగణిస్తామని ఆయన అన్నారు.

సకల జనుల సమ్మె ప్రభావం కేంద్ర ప్రభుత్వ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. సమ్మెను పొడగించకుండా విరమించాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. సమ్మె వల్ల ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడ్డారని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పంతాలు వీడాలని ఆయన కోరారు. బాన్సువాడ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస గౌడ్ ఉత్తమమైన ఫలితం సాధించారని ఆయన అన్నారు.

English summary
PCC President Botsa Satyanarayana supported minister Danam Nagender in Addagutta incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X