అంచనాలను దాటిన కాంగ్రెసు అభ్యర్థి శ్రీనివాస్

ఉప ఎన్నికలలో పోటికి నిలపవద్దని తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అధిష్టానాన్ని అభ్యర్థించారు. కానీ అధిష్టానం మాత్రం పోటీకి నిలిపింది. దీంతో వారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీనివాస్ గౌడ్కు మద్దతు ప్రకటించమని స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెసు నేత కూడా వెళ్లి ప్రచారం చేసింది లేదు. అదే సమయంలో సమ్మెలో పాల్గొన్నారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ ఒక్కరే రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఆయనకు కేవలం స్థానిక నాయకుల మద్దతు మాత్రమే లభించింది. ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండటం, తమ పార్టీ నేతలు సహకరించక పోవడం తదితర అంశాలను పరిశీలిస్తే నైతిక విజయం తనదేనన్నారు.












Click it and Unblock the Notifications