సీమాంధ్రులకు హైదరాబాద్ పరాయి దేశమైంది: కోడెల
బాన్సువాడ ఎన్నికల్లో తెరాస పార్టీ తరఫున గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి గత ఎన్నికల కంటే మెజార్టీ తగ్గిందని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. 1994లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకు 54వేల మెజార్టీ వస్తే ఇప్పుడు 49 వేలే వచ్చిందన్నారు. ఉద్యమంలో అరెస్టయిన నేతలకు అర్ధరాత్రుళ్లు కూడా బెయిలు దొరుకుతుందని కానీ సామాన్యులు మాత్రం జైళ్లలోనే మగ్గుతున్నారన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం, తెరాస చీఫ్ కెసిఆర్లను తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుందన్నారు.
Comments
kodela siva prasad malladi vishnu somireddy chandramohan reddy telangana hyderabad కోడెల శివ ప్రసాద్ మల్లాది విష్ణు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ హైదరాబాద్
English summary
TDP senior leader Kodela Siva Prasad blamed Telanganites for Sakala Janula Strike.
Story first published: Monday, October 17, 2011, 16:33 [IST]