హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్రులకు హైదరాబాద్ పరాయి దేశమైంది: కోడెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodela Siva Prasad
హైదరాబాద్: సీమాంధ్రులకు హైదరాబాదు వెళ్లాలంటే పరాయి దేశంలా కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ సోమవారం అన్నారు. బాధ్యత లేని వ్యక్తులు సకల జనుల సమ్మెలో పాల్గొనడం వల్లనే రాష్ట్రంలో ఇంతటి తీవ్ర సంక్షోభం ఏర్పడిందన్నారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేర్పాటు వాదుల ఆటలు ఇక సాగనిచ్చేది లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ గుంటూరు జిల్లాలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ఉద్యమం కేవలం కుటుంబ పాలన కోసమేనని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కోసం తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పారు.

బాన్సువాడ ఎన్నికల్లో తెరాస పార్టీ తరఫున గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి గత ఎన్నికల కంటే మెజార్టీ తగ్గిందని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. 1994లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయనకు 54వేల మెజార్టీ వస్తే ఇప్పుడు 49 వేలే వచ్చిందన్నారు. ఉద్యమంలో అరెస్టయిన నేతలకు అర్ధరాత్రుళ్లు కూడా బెయిలు దొరుకుతుందని కానీ సామాన్యులు మాత్రం జైళ్లలోనే మగ్గుతున్నారన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం, తెరాస చీఫ్ కెసిఆర్‌లను తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుందన్నారు.

English summary
TDP senior leader Kodela Siva Prasad blamed Telanganites for Sakala Janula Strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X