విరమణ దిశగా తెలంగాణ సకల జనుల సమ్మె
కాగా, తెలంగాణ టీచర్స్ జెఎసి కూడా సమ్మె విరమణ దిశగా అడుగులు వేస్తోంది. టీచర్స్ జెఎసి నాయకులు మంత్రి పార్థసారథితో చర్చలు జరిపారు. సింగరేణి కార్మికులు కూడా సమ్మె విరమణకు యాజమాన్యంతో చర్చలు ప్రారంభించారు. చర్చలు కొలిక్కి అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యోగులు కూడా సమ్మెను విరమించే అవకాశం ఉంది. రాజకీయ నేతల తీరు పట్ల తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకుడు స్వామి గౌడ్ ఒకటి, రెండు సార్లు నిరసన వ్యక్తం చేశారు. బరువంతా తమ మీద మోపి, రాజకీయ నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ స్థితిలో తెలంగాణ స్టీరింగ్ కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమైంది. నవంబర్ మొదటి వారంలో తెలంగాణ మార్చ్ చేపట్టాలని జెఎసి నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ప్రజాప్రతినిధులు సామూహిక ధర్నాలు చేయనున్నారు.
సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవులుగా ప్రకటిస్తే సింగరేణి కార్మికులు సమ్మెను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. కాగా, మంత్రి పార్థసారథితో చర్చలను రెండు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. టిఆర్టియు, డిటిఎఫ్ మంత్రితో సోమవారంనాటి చర్చలను బహిష్కరించాయి.