తెలంగాణపై రెండో ఎస్సార్సీయే?: అల్వీ ప్రకటన దుమారం

అయితే, తెలంగాణకు రెండో ఎస్సార్సీతో సంబంధం లేదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు తెలంగాణకు వర్తించవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమే 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించిందని ఆయన అన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు బుధవారం గుంటూరులో అన్నారు. రాష్ట్ర విభజనపై రెండో ఎస్సార్సీ వేయాలనేదే తమ పార్టీ విధానమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుకు కూడా అదే వర్తిస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు.
రషీద్ అల్వీ మాటల్లోని ఆజాద్ తెలంగాణకు సంబంధించి చూసుకుంటారని చెప్పడాన్ని బట్టి మరో రకంగా అర్థమవుతోంది. మొత్తంగా రెండో ఎస్సార్సీని వేస్తూ తెలంగాణను ప్రత్యేకిస్తారా అనేది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. కాంగ్రెసు వ్యూహాత్మకంగానే రషీద్ అల్వీ చేత ప్రకటన చేయించారని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లో తెలంగాణపై ప్రకటన వెలువడుతుందని ఆజాద్ చెప్పిన తరుణంలో అల్వీ ఆ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications