వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై చిందులేసిన టిడిపి అధినేత చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం సాధిస్తానని పార్టీ పెట్టి, కాంగ్రెసులో కలిసిపోయారని, సొంత న్యాయం మాత్రమే చూసుకున్నారని ఆనయ చిరంజీవిపై వ్యాఖ్యానించారు. ముప్పయి ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుపై రాజీలేని పోరాటం చేస్తోందని, తెలుగుదేశం పార్టీ మాత్రమే కాంగ్రెసుపై పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. తనపై కుట్రలో భాగంగానే కోర్టులో కేసు వేశారని ఆయన విమర్శించారు. తన వాదన వినకుండా తన ఆస్తులపై హైకోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. గతంలో ఎన్టీ రామారావుపై కూడా కేసులు వేశారని ఆయన గుర్తు చేశారు. కేసులకు భయపడేది లేదని, కాంగ్రెసు ప్రజా వ్యతిరేక విధానాలపై, అవినీతిపై పోరాటం కొనసాగిస్తానని ఆయన అన్నారు. తాను భయపడను, కాంగ్రెసును వదిలిపెట్టననని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆయన శుక్రవారం రైతు పోరు బాట నిర్వహించారు.

రైతు సమస్యలపై ప్రభుత్వం దిగిరాకపోతే శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి కూడా వెనకాడబోనని ఆయన అన్నారు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. తిరుగుబాటు చేస్తే తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల 39 సెజ్‌లు పెట్టి భూములను దారాదత్తం చేశారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గనులను దోచుకున్నారని, భూములను అమ్ముకున్నారని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu has opposed the joining of Chiranjeevi in Congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X