జగన్ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా, అందుకే ఆ మాటలా?

నల్లకాలువలో ఇచ్చిన మాటకు కట్టబడి ఉండకపోతే తనకు మంత్రి పదవి కూడా ఇచ్చేవారేమోనని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఇంకా జీవించి ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దేశానికి వైయస్సార్ చాటి చెప్పారని ఆయన అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెసు పార్టీపై దూకుడుగా వ్యాఖ్యలు చేసిన జగన్ దాన్ని తగ్గించినట్లే కనిపిస్తున్నారు. గతంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ తర్వాత కాస్తా వెనక్కి తగ్గినట్లే కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిగతంగా సిబిఐ, ఈడిల విచారణను ఎదుర్కోవాల్సి రావడం, రాజకీయంగా తన వెంట వస్తారని భావించిన శాసనసభ్యులు జారుకుంటుండడం ఆయనను మనస్తాపానికి గురి చేసి ఉంటాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications