వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబూ! పరపతి పోగొట్టుకోకు: నాగం సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

nagam janardhan reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్లమెంటులో కూడా తన పరపతి పోగొట్టుకోకుండా మసలుకోవాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి సోమవారం సూచించారు. రైతుల కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు తెలంగాణ కోసం ఎప్పుడు వెళతాడో చెప్పాలన్నారు. కేంద్రం తెలంగాణపై చర్చలకు పిలిస్తే తెలుగుదేశం, కాంగ్రెసు తరఫున ఒక్కొక్కరే వెళ్లాలని సూచించారు. రెండు ప్రాంతాల నుండి ఇద్దరు వెళ్లి రెండు వాదనలు వినిపించడం సరికాదన్నారు. ఒకే నిర్ణయంతో టిడిపి, కాంగ్రెసు కేంద్రం ముందుకెళ్లాలన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు చేస్తే రాజీనామా చేయాలి లేదా సమావేశాలకు వెళ్లి తెలంగాణ కోసం సభ నడవకుండా అడ్డుకోవాలని అంతేకానీ సమావేశాలు బాయ్‌కాట్ చేస్తున్నామని డ్రామాలాడొద్దని హెచ్చరించారు.

కిరణ్ ప్రభుత్వం యుపి సిఎం మాయావతిని ఆదర్శంగా తీసుకొని ఈ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ ప్రాంతంలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని సూచించారు. పార్లమెంటులో ఈ శీతాకాలపు సమావేశాలలో బిల్లు పెట్టకుంటే ప్రజల నుండి యుద్ధం తప్పదన్నారు. ఉద్యమం సద్దుమణిగిందని భావించవద్దని ఇది కేవలం తుఫాను ముందు ప్రశాంతత మాత్రమేనన్నారు.

English summary
Telangana Nagara Samithi president Nagam Janardhan Reddy suggested TDP chief Nara Chandrababu Naidu about Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X