శంకరరావు నాన్ స్టాప్ దూకుడు, మళ్లీ వ్యాఖ్యలు

P Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల జౌళి శాఖ మంత్రి పి. శంకరరావు విరామం లేకుండా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారనేది అందరికీ అర్థమయ్యే విషయమే. రాజధాని హైదరాబాదులో జరుగుతున్న ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో తనను విస్మరిస్తున్నారని, తన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. నగర ప్రజాప్రతినిధులు తన ఫొటో పెట్టడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తన నియోజకవర్గంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో పిసిసి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా జరిగిన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆయన విమర్శించారు. దీని వెనక ఎవరున్నారో తనకు తెలియదని ఆయన అన్నారు. అయితే, అటువంటివాటిని తాను పట్టించుకోబోనని ఆయన అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెసు పార్టీ అధినేత సోనియా గాంధీ దృష్టిలో ఉన్నాయని ఆయన అన్నారు. పనులు జరగకపోతే ఇబ్బంది పస్తుందనే ఉద్దేశంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో ప్రభుత్వ వాటా పెంచడం స్వాగతించదగిన పరిణామమని ఆయన అన్నారు. దీనివల్ల వేయి కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి సమకూరుతుందని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఆ వ్యవహారంపై విచారణ జరగాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం టెండర్ల విషయంలో పట్టింపులకు వెళ్లరాదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+