హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్పీకర్ నాదెండ్లతో సమావేశమైన జగన్ ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు గురువారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం భేటీ అయ్యారు. జగన్ వర్గానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, రామచంద్రా రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, పూతలపట్టు రవి, ఆదినారాయణ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు స్పీకర్ సమావేశాలు సజావుగా జరిపేందుకు ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. టిడిపి తరఫున గాలి ముద్దుకృష్ణమ, దూళిపాళ్ల, పయ్యావుల హాజరయ్యారు. అయితే అవిశ్వాసంపై హామీ ఇచ్చిన తర్వాతే సమావేశాలు పెట్టాలని వారు స్పీకర్‌ను కోరారు.

కాగా అసెంబ్లీ ప్రారంభానికి ముందు కాంగ్రెసు ఎమ్మెల్యేలు జోగి రమేష్, గండ్ర వెంకటరమణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి 177 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అవిశ్వాసం పెట్టినా ఎలాంటి ఢోకా లేదన్నారు. అవిశ్వాసం పెడితే తొమ్మిదేళ్ల టిడిపి దుర్మార్గపు పాలన ఎండగడతామన్నారు. సిబిఐ కేసులతో సతమతమవుతున్న చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికే అవిశ్వాసం అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం బలం చూపించి భవిష్యత్తులో టిడిపి అవిశ్వాసం మాటెత్తకుండా చేస్తామన్నారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy mlas met speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X