మేము మీకు మీరు మాకు!: టిడిపికి కెటిఆర్ మెలిక

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని సిపిఐ ఎమ్మెల్యే గూండా మల్లేష్ అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందన్నారు. యుపి సిఎం మాయావతిని చూసి కిరణ్ కుమార్ ప్రభుత్వం నేర్చుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం స్వాతంత్ర్య పోరాటం కన్నా ఎక్కవగా ఉందన్నారు. తెలంగాణపై ప్రజలకిచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని బిజెపి ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.
తీర్మానాలతో సమయం వృథా తప్ప ఏమీ ఉండదని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కాగా సిపిఎం 104, 108 సర్వీసులపై వాయిదా తీర్మానం ఇవ్వగా, బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ తెలంగాణపై ఇచ్చాయి.












Click it and Unblock the Notifications