జగన్, కెసిఆర్ మిలాఖత్, పిఆర్పీకీ గాలం: జోరుగా పుకార్లు

ప్రభుత్వానికి పదిహేడు మంది ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై మంది కాంగ్రెసు, పిఆర్పీ ఎమ్మెల్యేలను తమ వైపుకు లాక్కోవడానికి కెసిఆర్, జగన్ ప్రయత్నాలు చేస్తున్నారట. 6గురు పిఆర్పీ అసంతృప్త ఎమ్మెల్యేలతో ఇప్పటికే జగన్ గ్రూపు మాట్లాడిందని అందుకే విప్ జారీ వద్దంటూ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. మరోవైపు కెసిఆర్ సుమారు పన్నెండు మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారట. జగన్ కూడా తన వర్గానికి చెందిన కోమటిరెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారట.












Click it and Unblock the Notifications