జగన్ ఎమ్మెల్యేలపై వేటుకు రెడీ, బొత్సకు ఆజాద్ పిలుపు

ఆజాద్తో చర్చించిన అనంతరం పిసిసిఈ వ్యవహారంలో తగిన చర్య తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి బుధవారం ఉదయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయంత్రానికల్లా ఆజాద్ నుంచి బొత్సకు పిలుపు వచ్చింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రతిపక్షం ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన ఆ 16 మంది ఎమ్మెల్యేల పైనా అనర్హత వేటు వేయవలసిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు కేంద్ర మంత్రి ఆంటోనీకి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఆంటోనీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే జగన్ వ ర్గీయులపై చర్య తీసుకునేముందు మరి కొంత వ్యవధి ఇచ్చి చూస్తే మంచిదని మంత్రి శంకరరావు బుధవారంనాడు పేర్కొన్నారు.
దమ్ముంటే అందరినీ ఒక్క సారే అనర్హులుగా ప్రకటించండి అని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారంనాడు సవాలు చేయగా, ఆయన తమకేమీ సలహాలు ఇవ్వనక్కరలేదని, ఎప్పుడు ఏ చర్య ఎవరిపై తీసుకోవాలో బాగా తెలుసునని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అప్పుడే సమాధానం చెప్పారు.












Click it and Unblock the Notifications