చంద్రబాబు, వైయస్ జగన్‌లపై బొత్స ఎదురు దాడి

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎదురు దాడికి దిగారు. ప్రజలకు చవగ్గా బ్రాందీ అందుబాటులోకి తెస్తానని చంద్రబాబు నాయుడు అన్నారని, ఇది రాజకీయ దిగజారుడుతనమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మద్యపాన నిషేదం విధిస్తానంటే ఏదో మంచి పనిచేస్తున్నాడని అనుకోవచ్చునని, అయితే అధికారంలోకి వస్తే చవగ్గా మద్యం అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, రాజకీయాల కోసం ఏది వస్తే అది మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. మైలవరం కల్తీ సారా ఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి తగిన సూచనలు చేయాలి తప్ప విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

మైలవరం కల్తీ సారా ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయబాబు అనుచరులని, విజయబాబు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు అనుచరుడని ఆయన అన్నారు. విచారణ జరిగితే ఏ పార్టీవారు కల్తీ సారా ఘటనకు బాధ్యులో తెలుస్తుందని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కల్తీ సారా ఘటనను చంద్రబాబు వాడుకుంటున్నారని ఆయన అన్నారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధర్నా చేయడాన్ని ఆయన విమర్శించారు. ధర్నాలు చేయడం వంటి చౌకబారు ఆలోచనలు వైయస్ జగన్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం సోనియా నాయకత్వంలోని తమ నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, దాన్ని అమలు చేసి తీరుతామని, అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+