విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురంధేశ్వరితో తగువు లేదంటూనే టిఎస్ఆర్ కొలికి

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandheswari
విశాఖపట్నం: కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో తనకు ఏ విధమైన విభేదాలు లేవంటూనే కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి విశాఖపట్నం లోకసభ స్థానం విషయంలో కొలికి పెడుతున్నారు. పురంధేశ్వరితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని, తమ మధ్య తగువు లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ ఇరువురి మధ్య స్నేహసంబంధాలున్నాయని ఆయన చెప్పారు. అయితే, విశాఖపట్నం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని, పురంధేశ్వరి మరో నియోజకవర్గాన్ని చూసుకోవాలని గతంలో అన్నారు. దానిపై పురంధేశ్వరి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను నియోజకవర్గం మారే ప్రసక్తి లేదని ఆమె కచ్చితంగానే చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన పురంధేశ్వరికి అప్పట్లో కాంగ్రెసు అధిష్టానం విశాఖపట్నం సీటు ఇచ్చింది. అక్కడి నుంచి ఆమె విజయం సాధించారు. ఇప్పుడు ఆ సీటుపై టి. సుబ్బిరామిరెడ్డి పేచీ పెడుతున్నారు.

English summary
Congress MP T Subbirami reddy clarifid that he is not having any differences with Union minister Daggubati Purandheswari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X