కొత్త ఎమ్మెల్యేల శిక్షణలో చిరంజీవి: ఫ్యాన్స్ సందడి

Chiranjeevi
విశాఖపట్నం: కొత్త శాసనసభ్యులకు అవగాహన, శిక్షణలో భాగంగా రెండో రోజు మంగళవారం అరకులో జరిగిన కార్యక్రమానికి తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వచ్చారు. శిక్షణలో పాల్గొనేందుకు చిరంజీవి రావడంతో అక్కడ సందడి పెరిగింది. చిరంజీవి వచ్చాడని తెలిసి అభిమానుల భారీగా తరలి వచ్చారు. ఆయన రాక నేతల్లో కూడా ఒకింత ఆనందాన్ని నింపింది. విధి నిర్వహణ, శాసనసభ వ్యవహారాల్లో ఈ కార్యక్రమం తమకు చక్కగా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించిన అనంతరం 2009లో మొదటిసారి తిరుపతి నుండి ఎన్నికయ్యారు. ఆయన కూడా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కాబట్టి శిక్షణలో పాల్గొన్నారు.

కార్యక్రమం సందర్భంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఎమ్మెల్యేలంటే నియోజకవర్గానికే పరిమితం కావాలని లేదని, పరిధిని విస్తరించుకోవాలని, సేవా దృక్పథం అలవర్చుకోవాలని, ర్రాష్టానికి, దేశానికి కొంత సమయం వెచ్చించాలని, ప్రభుత్వం అంటే సచివాలయం మాత్రమే కాదని, మనం కూడా అందులో భాగమేనని సూచించారు. జట్టుగా స్ఫూర్తితో పని చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని, దేశాభివృద్ధికి అందరం కలిసి పాటుపడాలని చెప్పారు. ఎమ్మెల్యేలకు విజన్ ముఖ్యమని, దూరదృష్టి ఉంటే ఎన్నో అభివృద్ధి పనులకు ఇప్పుడే బాటలు వేయగలుగుతామని చెప్పారు.

రాష్ట్రంలో సగం మంది ఎమ్మెల్యేలు ఒక ప్రాంతం సమస్యలపై అధ్యయనం చేయడానికి వెళ్లడం, అక్కడి ప్రజలతో మమేకమై, వారి ఇబ్బందులు తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించడం శాసనసభ చరిత్రలో ఇదే ప్రథమమని ప్రకటించారు. కొందరు ఆరోపిస్తున్నట్టు సేద తీరడానికో, సరదాలు తీర్చుకోవడానికో ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. ఇలాంటి సదస్సు దేశంలోనే కాదు, కామన్ వెల్త్ దేశాల్లోనూ ఎక్కడా జరగలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+