మోత్కుపల్లి నర్సింహులుపై తెరాస కార్యకర్తల దాడి

Mothkupalli Narasimhulu
నల్లగొండ: తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు దాడి చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. మోత్కుపల్లి నర్సింహులుపై తెరాస కార్యకర్తలు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో తెలుగుదేశం, తెరాస కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు సముదాయించి పక్కకు తోసేసి, సర్ది చెప్పారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.

మోత్కూరు గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఆ చేదు అనుభవం ఎదురైంది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెరాస కార్యకర్తలు మోత్కుపల్లిపై దాడి చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని తెరాస కార్యకర్తలు అన్నారు. కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు మోత్కుపల్లిని డిమాండ్ చేశారు. మోత్కుపల్లి నర్సింహులు నల్లగొండ జిల్లాకు చెందినవారే. ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కాగా, ఆయన స్వగ్రామం ఆలేరు శాసనసభా నియోజకవర్గంలోని పారుపల్లి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+