హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన పిఆర్పీ మంత్రుల శాఖలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah-Ganta Srinivas Rao
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గానికి చెందిన మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు ఎట్టకేలకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. రామచంద్రయ్యకు దేవాదాయ, గంటాకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఓడరేవులు శాఖలను కేటాయించారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రామచంద్రయ్య, గంటాలు భేటీ అయ్యారు. వారు విద్యుత్, వాణిజ్య శాఖలకు పట్టుబడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉదయం సిఎంతో భేటీ ఐన తర్వాత తీవ్ర తర్జనభర్జన అనంతరం సిఎం కేటాయించిన శాఖలకు వారు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. గురువారం రాత్రి చిరంజీవి, సిఎంతో భేటీ అయి శాఖలపై చర్చించిన విషయం తెలిసిందే. సిఎంతో భేటీ తర్వాత కొత్త మంత్రులతో చిరంజీవి అప్పుడే భేటీ అయ్యారు.

అప్పటికీ శాఖల కేటాయింపు ఓ కొలిక్కి రాలేదు. ఉదయం మంత్రులతో సిఎం భేటీ ద్వారా శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కాగా గురువారం ఉదయం గం.11.43 నిమిషాలకు వీరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో రామచంద్రయ్య టిడిపి హయాంలో మంత్రిగా చేశారు. గంటా శ్రీనివాస రావు మంత్రి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

English summary

 CM Kiran Kumar Reddy allocated portfolios to C Ramachandraiah and Ganta Srinivas Rao today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X