కిషన్ రెడ్డికి, కెసిఆర్కు మధ్య తేడాలు: బిజెపి దూరం?

నిజానికి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తెలంగాణ జెఎసి కార్యక్రమాల్లో పెద్ద పాల్గొనడం లేదు. బిజెపి నుంచి సిహెచ్ విద్యాసాగర రావు, బండారు దత్తాత్రేయ జెఎసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విద్యాసాగర రావు పార్టీ కన్నా జెఎసికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి నుంచి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఎప్పుడో తప్పుకున్నాయి. జెఎసి తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆ రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అభిప్రాయం బిజెపిలో పెరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications