కమిటీలపై మరో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్సీల అసంతృప్తి

హక్కుల కమిటీకి రాజీనామా చేయబోతున్నట్లు మరో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చెప్పారు. కమిటీలో తెలంగాణకు వివక్ష జరుగుతోందని ఆయన ఆరోపించారు. శాసనమండలి కమిటీల ఏర్పాటులో వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాగా తెలంగాణ ఎమ్మెల్సీల పట్ల, సీనియర్ల పట్ల శాసనమండలి చైర్మన్ చక్రపాణి అవమానకరమైన పద్ధతిలో వ్యవహరించారని ఆమోస్ బుధవారం ఆరోపిస్తూ రాజీనామా వేసిన విషయం తెలిసిందే. సీనియర్లకు కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తాము తెలంగాణకు చెందినవాళ్లం కాబట్టే చైర్మన్ పదవుల్లో వేయడం లేదని, సీనియర్లను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications