జగన్ కేసుతో సంబంధం లేదు: మాజీ సిఎస్ రమాకాంత్

రమాకాంత్ రెడ్డి జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఎదుట హాజరయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన హయాంలో జారీ చేసిన జివోలపై ఆయనను సిబిఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. దిల్ కుషా అతిథి గృహంలో ఆయనను సిబిఐ విచారించింది. సుమారు ఆరున్నర గంటల పాటు ఆయనతో సిబిఐ మాట్లాడింది. కాగా జగన్ ఆస్తుల కేసులో మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా కూడా గురువారం సిబిఐ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆయనను అధికారులు రెండు గంటల పాటు విచారించారు.












Click it and Unblock the Notifications