కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అత్యాచారం చేయబోయాడు, అరవడంతో నిప్పంటించాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar
కరీంనగర్: జిల్లాలో ఆదివారం ఘోరం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి మండలంలో ఓ యువకుడు ఓ యువతిపై అత్యాచారం చేయబోయి ఆమె అడ్డుకోవడంతో అతను వెంటనే ఆమెకు నిప్పంటించాడు. లావణ్య అనే వివాహిత భర్త ఆరేళ్ల క్రితం విదేశాలకు వెళ్లాడు. ఆమెపై కన్నేసిన ఓ దూరపు బంధువు ఉదయం లావణ్య వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆయన బలవంతం చేయబోయాడు. వెంటనే ఆమె అరుస్తూ బయటకు పరుగెత్తేందుకు ప్రయత్నించింది. అతను ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బాధితురాలిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

English summary
A relative set fire to his relative in Karimnagar district today. She sent to Hyderabad hospital for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X