నేడే విస్తరణ: ముగ్గురికి ఛాన్స్, తెర పైకి కొత్తగా డిఎస్ పేరు

మరోవైపు శాసనమండలి సభ్యుడు, పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ పేరు తాజాగా తెర పైకి వస్తోంది. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పలువురు సిఎం దృష్టికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర నేతలతో భేటీ అనంతరం సిఎం పేర్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మూడో మంత్రి పదవికి కూడా అధిష్టానం అనుమతిచ్చిందని, అది కోస్తా నుండి భర్తీ చేయవచ్చుననే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ చీప్ విప్ కొండ్రు మురళిని ఇది దక్కే అవకాశముంది. మంత్రుల శాఖల మార్పుల పైనా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రసాద్ కుమార్, కోస్తా నుండి కొండ్రుకు అంతిమంగా ఛాన్స్ ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications