సోనియా తెలంగాణపై మొండి వైఖరి వీడాలి: కెసిఆర్

రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు, ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేస్తుంటే కిరణ్ సర్కారు మొద్దు నిద్రపోతోందని దుయ్యబట్టారు. లక్ష ఉద్యోగాలిస్తామని సిఎం పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా, అవి డూప్లికేట్ అన్న భావనతోనే ప్రధాని ఆ కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తోందని తెలంగాణ ఏర్పడ్డాక ఒకే ఒక్క సంతకంతో అందర్నీ రెగ్యులరైజ్ చేసి, వారి కన్నీరు తుడుస్తామని హామీ ఇచ్చారు. అలాగే గిరిజనులు, మైనారిటీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు ప్రకటించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని మైనారిటీలకు ఇస్తామని చెప్పారు. మార్చి నెల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications