వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏదో ఒకటి తేల్చండి: జగన్ వర్గం ఎమ్మెల్యే డిమాండ్
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఒంటిచేత్తో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెసుకు అధికారం కట్టబెట్టారన్నారు. ఇవాళ కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం గద్దెనెక్కాడానికి వైయస్ రెక్కల కష్టమే కారణమన్నారు. వైయస్ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబాన్ని, జగన్ను ఎలా అభాసుపాలు చేయాలి, ఎప్పుడు అరెస్టు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పని చేస్తున్నారని విమర్శించారు. వైయస్ పథకాలు కిరణ్ సర్కారు నీరుగారుస్తోందన్నారు. తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని, తద్వారా తమ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెసు భయపడుతోందని అందుకే స్పీకర్ తమపై అనర్హత వేటు వేయకుండా ఒత్తిడి తెస్తున్నారన్నారు.
Comments
gurnath reddy ys jagan ysr congress nadendla manohar గుర్నాథ్ రెడ్డి వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు నాదెండ్ల మనోహర్ అనంతపురం
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mla Gurnath Reddy challenged speaker Nadendla Manohar about Disqualification issue.
Story first published: Tuesday, February 7, 2012, 8:53 [IST]