జగన్పై ఓదార్పు యాత్రలో కోడిగుడ్లు, రాళ్లతో దాడి

మిర్చి, పత్రి రైతులను కదిపితే కన్నీళ్లు వస్తున్నాయని ఆయన అంతకు ముందు చేజేర్లలో అన్నారు. చేజెర్లలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. చేజెర్లలో కూడా కాస్తా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాటు చేస్తున్న సమయంలో కాస్తా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి పూనుకున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో విలువలు లేని రాజకీయాలు నడుపుతూ ప్రజా సమస్యలను, రైతులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. నిరుడు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications