విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిగ్గులేకుండా ఇంకా కొనసాగుతున్నారు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: పార్టీకి యువతే ప్రధానమైన బలమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడలో జరిగిన యువతరంగం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువకులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో సగం మంది 25 ఏళ్ల లోపు ఉన్న వాళ్లేనని ఆయన అన్నారు. టిడిపికి బలమైన శక్తి యువతే అన్నారు. అవినీతిరహిత భారతదేశం యువతతోనే సాధ్యమన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. వారు వస్తేనే రాజకీయాల్లో మార్పు కనిపిస్తుందన్నారు. యువత తల్చుకుంటే దేన్నైనా సాధిస్తారని అన్నారు. రాష్ట్రంలో మంత్రులు అవినీతిలో కూరుకు పోయారని విమర్శించారు. మంత్రుల అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా వారు సిగ్గు లేకుండా పదవుల్లోనే కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు.

పోలవరం టెండర్ల ఫైళ్లు స్పీకర్ ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. వాటిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా రాజీనామా చేయాలని ఆయన అన్నారు. కాగా యువతరంగం కార్యక్రమానికి భారీగా యువత తరలి వచ్చారు. అంతకుముందు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో దిగి, అక్కడి నుండి బైక్ ర్యాలీగా వేదిక వద్దకు వెళ్లారు. ఆయన బుల్లెట్ నడిపి యువతను ఉత్సాహపరిచారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu blamed minister for their corruption. He demanded ministers resignation. Ha participated in Yuvtarangam at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X