హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి శాసనసభా పక్ష ఉప నేత పదవి ఖరారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా ప్రకటించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియను పూర్తి చేసి, చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా నియమిస్తారని తెలుస్తోంది. శానససభలో ప్రజారాజ్యం పార్టీ ఇంకా సాంకేతికంగా కాంగ్రెసు పార్టీలో విలీనం కాలేదు. విలీన ప్రక్రియ పూర్తయితే చిరంజీవి శానససభలో వెనక సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానివల్ల గత శానససభా సమావేశాల సందర్భంగా విలీనానికి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదం తెలుపలేదని అంటున్నారు.

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారికి శాసనసభలో వెనక సీట్లు కేటాయిస్తారు. చిరంజీవి శానససభకు తొలిసారి ఎన్నిక కావడం వల్ల విలీన ప్రక్రియ పూర్తయితే వెనక సీట్లోకి వెళ్లాల్సి వస్తుంది. దీన్ని నివారించడానికే కాకుండా చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి ఆయనను శాసనసభా పక్ష ఉప నేతగా ప్రకటించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నప్పుడు జె గీతా రెడ్డిని శాసనసభా పక్ష ఉప నేతగా నియమించారు. రోశయ్య ఎమ్మెల్సీ కావడంతో ఆ పని చేశారు. ఇప్పుడు మాత్రం చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి మాత్రమే ఆ పదవిని భర్తీ చేస్తున్నారు.

శానససభా సమావేశాలు ఈ నెల 13వ తేదీన ప్రారంభవుతున్నాయి. 13వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీనికి ముందే చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా ప్రకటించే ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.

English summary
It is learn that CLP deputy keader post is finalised to mega star Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X