కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎల్‌ పై సిఎం బేఖాతరు , కడప సమావేశం తిరుపతిలో

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
కడప: కాంగ్రెసుకు సంబంధించి కడప జిల్లాలో ముఖ్య నాయకుడు డిఎల్ రవీంద్రా రెడ్డి. ఆయనను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కడప జిల్లా సమావేశాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఎవరూ ముందుకు రాని సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై కడప ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెసు నుంచి డిఎల్ రవీంద్రా రెడ్డి ముందుకు వచ్చారు. ఇప్పడు మళ్లీ ఉపఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థితిలో కడప జిల్లా ఉప ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు తిరుపతిలో శనివారం భేటీకి డిఎల్ రవీంద్రా రెడ్డిని దూరం పెట్టారు. సీఎం కిరణ్ నేతృత్వం వహించనున్న ఈ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుపతికి బయలుదేరగా, డీఎల్ ఊసే ఎక్కడా వినిపించడం లేదు.

కడపపై సమావేశాన్ని తిరుపతిలో పెట్టడం ఏమిటని ఇప్పటికే డీఎల్ ప్రశ్నించారు. తిరుపతిలో పెడితే రాబోనని ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయినా, తిరుపతినే వేదికగా చేసుకోవడం వెనక డీఎల్‌ను ఒంటరిని చేసే వ్యూహం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శాఖలో కోత పెట్టినందుకు కిరణ్‌పై బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్న డీఎల్‌ను సొంత జిల్లాలోనే ఏకాకిని చేసేందుకే ఇలాచేస్తున్ననరా అని రాజకీయవర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

English summary
CM Kiran kumar Reddy is ignoring minister DL Ravindra Reddy in Kadapa district politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X