హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పోరుపై బిజెపి కిషన్‌కు టిడిపి నేతల సలహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy and Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తెలంగాణలో ఉప ఎన్నికల్లో పోటీ అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, తుమ్మల నాగేశ్వర రావు భారతీయ జనతా పార్టీకి మంగళవారం సలహా ఇచ్చాయి. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉదయం సభను అరగంట వాయిదా వేసిన అనంతరం లాబీల్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డికి మోత్కుపల్లి, తుమ్మల ఎదురయ్యారు. వారు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ సమయంలో టిడిపి నేతలు... తెలంగాణ రాష్ట్ర సమితితో తెగతెంపులు చేసుకొని మంచి పని చేశారని కిషన్ రెడ్డితో అన్నారు. మీరు రాజీనామా చేయకున్నప్పటికీ ప్రజల్లో బాగానే తిరుగుతున్నారని, మేం మాత్రం రాజీనామా చేసి కూడా తిరగలేకపోతున్నామని ఆయనతో అన్నారు. ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కిషన్‌కు సూచించారు.

అందుకు కిషన్ రెడ్డి.. తెలంగాణ కోసం రాజీనామాలు ముఖ్యం కాదని చిత్తశుద్ధి ముఖ్యమని వారితో చెప్పారు. తాము ఇప్పటికే మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నామని, రెండు చోట్ల పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోచోట పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

English summary
Telugudesam Party leader Mothkupalli Narasimhulu and Tummala Nageshwara Rao suggested BJP state president Kishan Reddy on Telangana by-polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X