ఆదాయానికి మించి ఆస్తులు!: శ్రీలక్ష్మికి కొత్త చిక్కులు

కాగా గాలి గనుల కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి కేసు మలుపు తిరగడం గమనార్హం. ఓఎంసి కేసులో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆమెను కొత్త చిక్కులు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. గనుల కేసు నుండి ఆదాయానికి మించి ఆస్తులకు మలుపు తిరగడం గమనార్హం. కాగా శ్రీలక్ష్మికి సంబంధించిన కేసు డైరీ, స్టేటస్ రిపోర్టును సిబిఐ సుప్రీంకు సమర్పించింది. కాగా గత నవంబరు ఆఖరు వారంలో అరెస్టైన శ్రీలక్ష్మికి డిసెంబర్ 2వ తేదిన బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు విచారించిన కోర్టు 27కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications