సభలో చంద్రబాబుకు మంత్రి మాణిక్య వరప్రసాద్ కౌంటర్
రిపబ్లిక్ దినోత్సవం రోజు కూడా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలను ఈ ప్రభుత్వం కాపాడలేక పోయిందన్నారు. పలుచోట్ల విగ్రహాల ధ్వంసం జరిగిందన్నారు. టిడిపి హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందన్నారు. భారతదేశంలో తొలిసారి బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత టిడిపిదేనన్నారు. చరిత్రను ఎవ్వరూ తుడపలేరన్నారు. కొన్ని రోజులు మభ్యపెట్టిస్తారేమో కానీ తుడపలేరన్నారు. మేం ఏం మాట్లాడాలో చెప్పే అర్హత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేదన్నారు. దళితులకు ఎక్కడా పదవులు ఇవ్వలేదన్నారు. చివరకు మమ్మల్ని కూడా డిప్యూటీ స్పీకర్ చేశారు తప్ప స్పీకర్ చేయలేదని మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి అన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ను నియమించలేదన్నారు. పశుక్రాంతిని పశుభ్రాంతిగా మార్చారన్నారు. కాంగ్రెసు విధానాల వల్లనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుందన్నారు. హైదరాబాదులో మతకలహాలను తగ్గించింది టిడిపియేనన్నారు.