బాబు అమ్మితే ఫైట్ చేశారు!: టిడిపి నేతకు సిఎం కితాబు

ముప్పయ్యేళ్ల తర్వాత చంద్రబాబుకు యువతరంగం ఎందుకు గుర్తుకు వచ్చిందో అని ఎద్దేవా చేశారు. మోటార్ సైకిల్ ఎక్కితే యువత బాబు వెంట వెళ్లదన్నారు. ప్రజా సంక్షేమం కోసం తాము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగానే రాజీవ్ యువకిరణాలు పెట్టామన్నారు. బాబు కిరణాల పథకాన్ని విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబును బిల్ గేట్స్తో కలిపిన వ్యక్తి ప్రభుత్వ పథకాల సలహాదారుల్లో ఉన్నారన్నారు. యువకిరణాలు ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల రాలేదన్నారు. ఆయన త్వరలో వస్తారన్నారు. ప్రజా సంక్షేమం కోసం వీలుంటే ప్రభుత్వానికి సాయం చేయండి లేదంటే గమ్మున కూర్చోండని బాబుకు సిఎం సూచించారు. బాబుకు ఇష్టమైన వరల్డ్ బ్యాంక్ కూడా ఆంధ్ర ప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైనదని కితాబు ఇచ్చిందన్నారు. మహిళలకు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కేవలం చిత్తూరు జిల్లాలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. అన్ని రంగాల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం 72 లక్షల మందికి పింఛన్లు ఇస్తుందన్నారు. యువత కాంగ్రెసు వైపు చూస్తోందన్నారు.












Click it and Unblock the Notifications