హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి హెలికాప్టర్, కార్ల పిటిషన్‌పై విచారణ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: సిబిఐ స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్‌తో పాటు ఇతర వాహనాలను తనకు ఇప్పించాలని ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై కోర్టు విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి దాఖలు చేసుకున్న ఆ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారణను వాయిదా వేసింది. వారి పిటిషన్‌పై సిబిఐ ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది.

అక్రమ గనుల తవ్వకాల ద్వారా సంపాదించిన సొమ్ముతోనే వారు ఈ వాహనాలను కొనుగోలు చేశారని సిబిఐ వాదించింది. హెలికాప్టర్‌ను, ఖరీదైన కార్లను వారికి అప్పగిస్తే విక్రయించే అవకాశం ఉందని అంటూ అందువల్ల వాటిని తిరిగి వారికి ఇవ్వకూడదని సిబిఐ కోరింది.

కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన విజయ రాఘవన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణను రేపటికి (బుధవారంనాటికి) వాయిదా వేసింది. విజయరాఘవన్‌కు బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ కోరింది. కేసు దర్యాప్తులో ఉన్నందున విజయరాఘవన్‌కు బెయిల్ ఇవ్వకూడదని వాదించింది. విజయరాఘవన్ పిటిషన్‌పై రేపు కౌంటర్ దాఖలు చేస్తామని సిబిఐ తెలిపింది. విచారణ సందర్భంగా నిందితుడు విజయరాఘవన్‌ను కోర్టులో హాజరు పరచాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.

English summary
CBI court adjourned hearing on Gali Janardhan reddy's petition, filed seeking for his vehicles from CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X