జనాల్ని చూస్తే గెలుస్తామనిపిస్తోంది: తేల్చేసిన బొత్స

కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణ సాధ్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ వేరుగా అన్నారు. ప్రత్యేక తెలంగాణ, రాష్ట్ర అభివృద్ధియే ఉప ఎన్నికల్లో మా నినాదం అని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలంటే కాంగ్రెసు పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. ఓట్లు, నోట్ల కోసమే కెసిఆర్ రాజకీయాలు అన్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుండి ఉప ఎన్నికలే తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. టిఆర్ఎస్ భవనం వ్యాపారాలకు వాడుకోవద్దన్నారు. టిఆర్ఎస్ భవనం పేపర్, ఛానల్ నడుపుతోందన్నారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కెసిఆర్ ప్రజలకు లబ్ధి చేకూర్చిందేమీ లేదని వారి కుటుంబమే లాభపడిందన్నారు. కాగా బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికలు జరగబోయే పలు నియోజకవర్గాల నేతలతో గురువారం భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.












Click it and Unblock the Notifications