ఆ పదిహేడు స్థానాల్లో ఉప ఎన్నికలు ఎప్పుడు?

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం పదిహేడు మంది శాసనసభ్యులపై ఎట్టకేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేటు వేయడంతో ఆ ఉప ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనే చర్చ సాగుతోంది. మార్చి 18వ తేదిన తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం వీటిపై దృష్టి సారించనుంది. వేటు పడిన జగన్ వర్గం నేతల నియోజకవర్గాల స్థానాల్లో ఉప ఎన్నికలకు అంతగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలలోని ఉప ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే పద్ధతిని అనుసరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలతో పాటు వేటు పడిన జగన్ వర్గం నేతల స్థానాలలో ఉప ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ జూలైలోగా ఆ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెలువర్చాల్సి ఉంటుంది. అంటే జూన్‌ నెలలోగా ఆయా స్థానాలలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+