వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పదిహేడు స్థానాల్లో ఉప ఎన్నికలు ఎప్పుడు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం పదిహేడు మంది శాసనసభ్యులపై ఎట్టకేలకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేటు వేయడంతో ఆ ఉప ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనే చర్చ సాగుతోంది. మార్చి 18వ తేదిన తెలంగాణలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం వీటిపై దృష్టి సారించనుంది. వేటు పడిన జగన్ వర్గం నేతల నియోజకవర్గాల స్థానాల్లో ఉప ఎన్నికలకు అంతగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలలోని ఉప ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే పద్ధతిని అనుసరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలతో పాటు వేటు పడిన జగన్ వర్గం నేతల స్థానాలలో ఉప ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ జూలైలోగా ఆ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెలువర్చాల్సి ఉంటుంది. అంటే జూన్‌ నెలలోగా ఆయా స్థానాలలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

English summary
It seems, Bypolls in YSR Congress Party chief YS Jaganmohan Reddy leaders constituencies may occured before June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X