గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ఆర్ విగ్రహానికి నిప్పు, జగన్ పార్టీ ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని యలమంద గ్రామంలో ఎస్సీ కాలనీలో వైయస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఇంకా ఆవిష్కరించలేదు. త్వరలో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. అయితే సోమవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బండిపై వచ్చి దానికి నిప్పు పెట్టారు. దీంతో విగ్రహం చుట్టూ ఉన్న పేపర్లు కాలిపోయాయి. విగ్రహం మసిబారింది. విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఇది సమస్యాత్మక గ్రామం అని అందరికీ తెలుసునని, వెంటనే పోలీసులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

వైయస్ విగ్రహం ఇంకా ఆవిష్కరించలేదని, దీంతో దాని చుట్టూ పేపర్లు చుట్టారని, మూడు గంటల ప్రాంతంలో బండిమీద వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు, కిరోసిన్ పోసి తగుల బెట్టారని పోలీసులు చెబుతున్నారు. కొందరు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకు వచ్చారని చెబుతున్నారు. దర్యాఫ్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని అన్నారు.

English summary
Unknown persons set fire to late YS Rajasekhar Reddy statue in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X