బొత్స ఆదేశాలు బేఖాతర్!: సమన్వయం లేక విలవిల
దీంతో రాష్ట్ర కాంగ్రెసులో గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మాట్లాడుతూ.. కడప ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కూర్చుని చర్చించుకుంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీ వివేక్, సీనియర్ నేతలు కె కేశవ రావు, జీవన్ రెడ్డిలు ముఖ్యమంత్రి వైఖరిని తప్పు పట్టారు. దీంతో సిఎం అనుకూల వర్గం, మంత్రులు కిరణ్ను టార్గెట్ చేసుకున్న వారిపై విరుచుకు పడ్డారు. మంత్రి డికె అరుణ, శైలజానాథ్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి తదితరులు సీనియర్లపై నిప్పులు గక్కారు. ఎన్నికలకు ముందే కొందరు నేతలు పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని, పార్టీ ఓటమి పాలవుతుందని పలుమార్లు బహిర్గతంగా చెప్పినా బొత్స అంటువంటి నాయకులను కట్టడి చేయలేక పోయారని అంటున్నారు.
గత సంవత్సరం తెలంగాణ ఉద్యమం సమయంలోనూ నేతలు ప్రాంతాల వారిగా విడిపోయి విమర్శలు గుప్పించుకున్నారు. రాష్ట్ర కాంగ్రెసు నేతల మధ్య సమన్వయం లోపించిందని, నాయకులు ప్రాంతాల వారిగా విడిపోవడం వల్లనే పార్టీ ఇలా బజారుపాలయిందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ నేతల మధ్య సమన్వయం చేయటంలో బొత్స విఫలమవుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శించిన వారిపై మిగిలిన నేతలు ఎదురు దాడి చేయకుండా కూడా బొత్స కట్టడి చేయడం లేదని అంటున్నారు.