జగన్పై ఏ కేసు పెట్టాలనే ఆలోచనే: వైయస్ విజయమ్మ

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత ప్రజల సంక్షేమం పట్టించుకున్న నాయకుడు రాష్ట్రంలో లేడన్నారు. కేంద్ర బడ్జెట్ చూస్తే అన్ని రేట్లు పెంచారన్నారు. పన్నులు వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. వైయస్ ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారన్నారు. కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు రద్దు చేశారన్నారు.
కానీ ఈ ప్రభుత్వం వైయస్ ఆశయాలను నీరుగారుస్తోందన్నారు. గోరు చుట్టు రోకటి పోటులా చేతివృత్తుల పైనా విద్యుత్ పెంపు ప్రభావం పడుతుందన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. వైయస్ విజయమ్మ, మరో నేత ఈసి గంగి రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పులివెందుల సబ్ స్టేషన్ను ముట్టడించింది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, శ్రీకాకుళంలో ధర్మాన పద్మప్రియ, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సూరినాయుడు ఇలా ఆయా జిల్లాలో ఆయా నేతల ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సబ్ స్టేషన్లను ముట్టడించి ఆందోళన నిర్వహించాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications